YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇతర పార్టీల నుండి జనసేన పార్టీ లో చేరిన యువత

ఇతర పార్టీల నుండి జనసేన పార్టీ లో చేరిన యువత

ఇతర పార్టీల నుండి జనసేన పార్టీ లో చేరిన యువత
నెల్లూరు 
రాష్ట్ర అధికార ప్రతినిధి చెన్నారెడ్డిమనుక్రాంత్  సమక్షంలో జనసేన నాయకులు సుజయ్బాబు ఆధ్వర్యంలో నగరంలోని ఇతర పార్టీల నుంచి 60 మంది కార్యకర్తలు జనసేన లో చేరి క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా మనుక్రాంత్ మాట్లాడుతూ,
 జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్  ఆశయాలకై యువత  పార్టీ లో చేరుతునానారనీ  తెలిపారు. జనసేన పార్టీ ని బలోపేతం చేస్తున్నామనీ,కరోనా సమయంలో ఎన్నో రకాల కార్యక్రమాలు చేశామనీ, రైతులకోసం పోరాటం చేయడం జరిగిందన్నారు. ఇంకా జిల్లాలో ప్రజలకోసం, పలు సమస్యలపై  పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు.
గతం లో పార్టీ తరపున పని చేసి ,గుర్తింపు కోసం చూస్తున్న కార్యకర్తలకు క్రియాశీలక సభ్యుల నమోదు మంచి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. జనసేన అధినేత పవన్_కళ్యాణ్  తరపున గతం లో సేవ చేసిన ,ప్రతీ కార్యకర్తలను గుర్తించి ,సభ్యత్వం నమోదు చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమం లో చెన్నారెడ్డి మనుక్రాంత్  జిల్లా నాయకులు గునుకుల కిషోర్,సుజయ్ బాబు,ప్రశాంత్ గౌడ్,సుల్తాన్ బాషా,షాజహన్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts