YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రపతి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఏపి గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్

రాష్ట్రపతి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఏపి గవర్నర్  బిశ్వ భూషణ్ హరిచందన్

విజయవాడ, అక్టోబర్ 01 
భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ జన్మ దినం నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిశ్వ భూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు.  ఈ మేరకు రాష్ట్రపతికి ఒక లేఖ రాశారు. గవర్నర్  హరిచందన్ మాట్లాడుతూ, దేశాధ్యక్షుని పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కలిసి తాను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలిపారు.  కరోనా మహమ్మారి   ఇక్కట్ల నేపధ్యంలో దేశానికి, ప్రజలకు రాష్ట్రపతి అందించిన సలహాలు మార్గదర్శకత్వం ఎంతో మేలు చేశాయన్నారు. కరోనా సవాలును ఎదుర్కోవటానికి  అవసరమైన ఆశ, విశ్వాసం, బలాన్ని   రాష్ట్రపతి అందించ గలిగారని గవర్నర్ అన్నారు. ఫలవంతమైన జీవితం, మంచి ఆరోగ్యం, ఆనందాలతో  భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముందుకు సాగాలని  బిశ్వ భూషణ్ హరిచందన్   ఆకాంక్షించారు. ఈ మేరకు పూరీ జగన్నాథ్, తిరుమల వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థిస్తున్నా నన్నారు. రాజ్ భవన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

Related Posts