సికింద్రాబాద్ అక్టోబర్ 2,
మహాత్మ గాంధీ 151 జయంతి సందర్బంగా ఎంజీ రోడ్డు లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పూలు వేసి నివాళులర్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అత్తిలి అరుణ, తెరాస నేతలు, స్థానికులు పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న రాజ్యాన్ని సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత బ్రహ్మాండంగా తెలంగాణ ను అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. అలాగే పట్టభద్రుల ఓటర్ల ఏన్ రోల్ మెంట్ డ్రోల్ మెంట్ ను మంత్రి ప్రారంభించారు. పట్టభద్రుల ఎన్నికలు అమెరికా లాంటి దేశాలల్లో ఉండేవని, మన దేశంలో లేవని అనుకునే వారు. అలా చాలా మంది ఎన్ రోల్ మెంటు చేసుకోకుండా ఉన్నారని, ఇప్పుడు డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరు ఓటరు నమోదు చేసుకొని రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి ఆర్ ఎస్ అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రుల ను కోరారు.