YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ కోమటిరెడ్డి

బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ కోమటిరెడ్డి

యాదాద్రి భువనగిరి అక్టోబ‌ర్ 2
రాజపేట మండలం పుట్టగూడెం గ్రామంలో మహాత్మ గాంధీ 151 వ జయంతి వేడుకల్లో భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  పాల్గొన్నారు ఈ సందర్భంగా మహాత్మా గాంధీ నూతన విగ్రహాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఎంపీ మాట్లాడుతూ శాంతిని ఆయుధంగా చేసుకుని దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహోన్నతమైన వ్యక్తి మన మహాత్మా గాంధీ. జాతిపిత విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. గ్రామాలు అభివృద్ధి జరిగితేనే దేశం అభివృద్ధి జరుగుతుందని గాంధీ గారు అన్నారు. గాంధీజీ కలలు కన్న సమాజం కోసం అందరు కృషిచేయాలి. ప్రతి పేదవాడు సొంత ఇంటితో సంతోషంగా ఉండాలి. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ లో గ్రామాలు కలకళలాడాలి. ప్రభుత్వం పేదవాడి సొంతింటి కలను నెరవేర్చాలి. చదువుకున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగం ఇవ్వాలి. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా పేదవాడికి రెండు పూటలా అన్నం దొరుకుతుందని అన్నారు. పేదల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు దొరికిన నాడే అవరవీరుల ఆత్మ శాంతిస్తుంది. మహాత్మా గాంధీ 151 వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నానని అయన అన్నారు.

Related Posts