హైదరాబాద్ అక్టోబరు 4,
గిప్ట్ ఏ స్మైల్ లో భాగంగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో అంబూలెన్స్ అందజేసిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..
పేదలకు, కరోనా బాదితులకు అంబూలెన్స్ లను మరింత అందుబాటులోకి తేవాలని ఐటీ, పురపాలక శాఖామంత్రి కే.టీ.రామారావు జన్మదినం సందర్బంగా గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో బాగంగా ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ రు అంబూలెన్స్ అందించడానికి ముందుకువచ్చారు. ఈ రోజు ప్రగతి భవన్ లో మంత్రులు కే.టీ .రామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ జెండా ఊపి అంబూలెన్స్ ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేష్, శంకర్ నాయక్, ఎంపి మాలోత్ కవిత, మేయర్ గుండా ప్రకాశ్ రావు తదితరులు ఉన్నారు..