YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

డ్రైవింగ్ సీటులో ప్రియాంక.. హథ్రాస్‌కు రాహుల్..

డ్రైవింగ్ సీటులో ప్రియాంక.. హథ్రాస్‌కు రాహుల్..

న్యూఢిల్లీ, అక్టోబరు 4,
హథ్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శనివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరారు. రెండు రోజుల కిందట కూడా హథ్రాస్‌కు బయలుదేరిన రాహుల్‌ను యూపీ పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. టొయోటా ఇన్నోవాను స్వయంగా సోదరి ప్రియాంక గాంధీ నడపుతుండగా.. ముందు సీట్లో ఆమె పక్కన రాహుల్ కూర్చున్నారు. ఢిల్లీ నుంచి బయలుదేరినప్పుడు ఆయన ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ఈసారి కాకపోతే మరోసారి ప్రయత్నిస్తామని వ్యాఖ్యానించారు.తమ పార్టీకి చెందిన 50 మంది ఎంపీలతో కలిసి రాహుల్‌, ప్రియాంక హాథ్రస్‌ బయల్దేరారు. అయితే బాధిత కుటుంబాన్ని రాజకీయ నాయకులు కలిసేందుకు ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఇంకా అనుమతి ఇవ్వట్లేదు. దీంతో ఢిల్లీ-నొయిడా టోల్ ప్లాజా వద్ద 200 మందికి పైగా పోలీసులను మోహరించారు. అక్కడ బారికేడ్లు ఏర్పాటుచేసి, దిగ్బంధించారు. రాహుల్‌ యూపీలోకి అడుగుపెట్టకుండా అడ్డుకోడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.ఇక, కాంగ్రెస్ నేతలను సరిహద్దులు దాటి లోనికి రానీయవద్దని అధికారు సూచించారు. మరోసారి హథ్రాస్‌కు వెళ్లేందుకు తాను ప్రయత్నిస్తానని, ఈసారి ఏశక్తీ అపలేదని ఈ ఉదయం రాహుల్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.‘హథ్రాస్ వెళ్లకుండా తనను ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదు.. అత్యంత దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబాన్ని కలిసి వారి బాధను పంచుకుంటాను’అని ట్వీట్ చేశారు.హథ్రాస్‌లో సిట్ దర్యాప్తు పూర్తికావడంతో మీడియాపై ఆంక్షలు ఎత్తివేసిన అధికారులు.. అక్కడ 144 సెక్షన్ కొనసాగుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా రాహుల్ పర్యటనకు అనుమతిలేదని హథ్రాస్ జాయింట్ కలెక్టర్ ప్రేమ్ ప్రకాశ్ మీనా ప్రకటించడం విశేషం. గ్రామంలో 144 సెక్షన్ కొనసాగుతున్నందున పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి ఉండరాదని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతిలేదు.. ప్రస్తుతం రాజకీయ పార్టీల నేతల పర్యటనపై నిషేధం కొనసాగుతోందని స్పష్టం చేశారు.
నన్ను ఎవరూ ఆపలేరు   ప్ర‌పంచంలో త‌న‌ను ఎవ‌రూ ఆప‌లేర‌ని, హ‌త్రాస్ బాధితురాలి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు వెళ్తున్నాన‌ని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం హ‌త్రాస్‌కు బ‌య‌ల్దేరిన రాహుల్‌, ప్రియాంక గాంధీల‌ను యూపీ పోలీసులు అడ్డుకున్న విష‌యం తెలిసిందే. ద‌ళిత బాలిక కుటుంబాన్ని ప‌రామ‌ర్శించాల్సిందేన‌ని కంక‌ణం క‌ట్టుకున్న రాహుల్ త‌న స‌హ‌చ‌రుల‌తో మ‌ళ్లీ ఇవాళ బ‌య‌ల్దేరారు. రాహుల్‌, ప్రియాంక గాంధీ ఒకే కారులో హ‌త్రాస్ బ‌య‌ల్దేరారు. ప్రియాంక‌నే స్వ‌యంగా కారును డ్రైవ్ చేస్తున్నారు. వీరి వెనుకాల కాంగ్రెస్ ఎంపీల బృందం రెండు బ‌స్సుల్లో బ‌య‌ల్దేరింది.  ఢిల్లీ, యూపీ స‌రిహ‌ద్దుల్లో పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేసి గేట్ల‌ను మూసివేశారు. ఢిల్లీ - నోయిడా వంతెన వ‌ద్ద రాక‌పోక‌ల‌ను పూర్తిగా నిలిపివేశారు. హ‌త్రాస్‌కు వెళ్లేందుకు నేత‌ల‌కు అనుమ‌తి లేద‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు. హ‌త్రాస్‌లో 144 సెక్ష‌న్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఉన్న‌తాధికారుల నుంచి ఆదేశాలు వ‌స్తేనే నేత‌ల‌కు అనుమ‌తి ఉంటుంద‌ని తెలిపారు.

Related Posts