భువనేశ్వర్ అక్టోబర్ 4,
మరో అణు సామర్ధ్య క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. కొత్తగా అభివృద్ధిచేసిన శౌర్య న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణిని ఒడిశాలోని బాలాసోర్ తీరంలో విజయవంతంగా పరీక్షించింది. భూతలం నుంచి భూతలంపైకి ప్రయోగించే ఈ క్షిపణికి 800 కి.మీ. దూరంలోని ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉన్నదని డీఆర్డీవో వెల్లడించింది. శౌర్య క్షిపణితో ప్రస్తుతం ఉన్న క్షిపణి వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందని అధికారులు తెలిపారు. ఈ క్షిపని చాలా తేలికైనదని, దీన్ని సులువుగా పరీక్షంచవచ్చని చెప్పారు. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని డీఆర్డీవో బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్ రేంజ్ నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు. ఈ క్షిపణి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను విజయవంతంగా చేధించగల సామర్థ్యం కలిగి ఉన్నది. డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) చేపట్టిన పీజే-10 ప్రాజెక్టు కింద ఈ పరీక్ష చేపట్టారు. దేశీయంగా రూపొందిందిన బూస్టర్తో ఈ బ్రహ్మోస్ క్షిపణిని లాంచ్ చేశారు.