YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

స్విమ్స్ ఆసుపత్రి ఘటనపై మంత్రి సీరియస్

స్విమ్స్ ఆసుపత్రి ఘటనపై మంత్రి సీరియస్

విజయవాడ అక్టోబ‌రు 5, 
తిరుపతి స్విమ్స్ పద్మావతి కోవిడ్ హాస్పిటల్ కొత్త బ్లాక్ లో ప్రమాదం సంఘటన పై ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్ అయ్యారు.  ప్రమాదం ఘటన పై తిరుపతి స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ నుండి వివరాలను ఫోన్ లో అడిగి తెలుసుకున్నారు.  ఈ ప్రమాదంలో దురదృష్టవ శాత్తు ఒక ఉద్యోగి చనిపోవడం బాధాకరం. కిటికీ పైన ఉన్న స్లాబ్ ఊడి పడిన ఘటనలో గాయపడిన కరోనా బాధితులకుమెరుగైన వైద్యం అందించాలని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ ను ఆదేశించారు.  ఈ ప్రమాదంలో మృతి చెందిన అవుట్ సోర్చింగ్ ఉద్యోగిని రాధిక కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆర్ధికంగా ఆదుకుంటామని అయన అన్నారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలుసుకొని ఒక నివేదిక ఇవ్వాలని ఇంజినీర్లను ఆదేశించారు. తిరుపతి స్విమ్స్ మొదటి అంతస్తులో కోవిడ్ బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్విమ్స్ డైరెక్టర్ కు మంత్రి ఆళ్ల నాని సూచించారు. ఆకస్మికంగా పెచ్చు ఊడి పడటంతో ప్రమాదం జరిగింది. పూర్తి విచారణకు ఆదేషించాం. ఈ ప్రమాదం ఘటనలో ఎవరైనా బాద్యులు అని తేలితే చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అయన వెల్లడించారు.

Related Posts