YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

షకలక శంకర్ ను అడ్డుకున్న పోలీసులు

షకలక శంకర్ ను అడ్డుకున్న పోలీసులు

విజయవాడ అక్టోబ‌రు 6 
కరోనా బాధితుల సహయార్థం విరాళాలు సేకరించడానికి విజయవాడ వచ్చిన సినీ నటుడు షకలక శంకర్ ను పోలీసులు అడ్డుకున్నారు.  బెంజ్ సర్కిల్ లో విరాళాల సేకరణను పోలీసులు ఆపివేసారు.  కోవిడ్ నేపథ్యంలో విరాళాలు సేకరించవద్దని  పోలీసులు అయనకు చెప్పారు.  ఒకవేళ విరాళాలు సేకరిస్తే కేసు నమోదు చేస్తామని శంకర్ ను హెచ్చరించారు.
షకలక శంకర్ మాట్లాడుతూ కరోనా కారణంగా చాలామంది ఉపాధి కోల్పోయారు. కరీంనగర్ లో విరాళాలు సేకరించి బాధితులకు అందచేసాం. ఇంట్లో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాలని ఆదుకునే ఉద్దేశంతోనే ఈ విరాళాలు సేకరిస్తున్నాం. ప్రత్యేకంగా ఒక్క చోటని నిర్ణయించుకోలేదు. ఎక్కడ విరాళాలు సేకరణ చేయాలనిపిస్తే అక్కడికి వెళ్లి పోతాను. అందుకే ఇప్పుడు విజయవాడ వచ్చానని అన్నారు.

Related Posts