YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆనం పార్టీ మారరు : మంత్రి సోమిరెడ్డి

ఆనం పార్టీ మారరు : మంత్రి సోమిరెడ్డి

ఆనం రాం నారాయణ రెడ్డి టీడీపీ వదిలి వైసీపీలోకి వెళ్తారని అనుకోవడం లేదు. ఆయన సోదరుడు వివేకానంద అనారోగ్యం కారణంగానే ఆయన హైదరాబాద్ లో ఉంటున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. ఆయన ప్రస్తుతం మా పార్టీలోనే ఉన్నారు  ????ఆయన పార్టీ మారుతున్నారనేది కేవలం మీడియా ప్రచారమని మంత్రి అన్నారు. ఏపీలో 99 శాతం మంది ప్రజలు బీజేపీని వ్యతిరేఖిస్తున్నారు. ఒకరో ఇద్దరో మీ పార్టీ కార్యకర్తలు తప్ప మిగిలిన వారంతా బీజేపీని ద్వేషిస్తున్నారని అన్నారు. ఏపీకి చేసిన అన్యాయం ప్రభావం దేశంలోని అన్ని రాష్ట్రాల మీదా పడింది. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం తప్పదు. అక్కడ తెలుగువారు ఎవరూ బీజేపీకి ఓటు వేయరు. కర్ణాటకలో మోడీ ప్రవర్తన వల్ల విసిగిపోయి ఉన్నారని అన్ఆనరు. తమిళనాడులో బీజేపీ ఆర్కే నగర్ ఎన్నికల్లో పోటీ చేస్తే నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని మంత్రి గుర్తు చేసారు.

Related Posts