తిరుమల అక్టోబరు 7,
తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్థసారథి, తిరుమల శ్రీవారిని బుధవారం కుటుంబ సమేతం గా దర్శించుకున్నారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కు సంబంధించిన ముందస్తు ఎన్నికల పనులలో ఎలక్షన్ కమిషన్ సిబ్బంది నిమగ్నమైంది అన్నారు. ఫిబ్రవరి మొదటి వారం లో జీ హెచ్ ఎం సి టర్మ్ ముగుస్తుందని , అందుకుగాను ఎన్నికల నిర్వహణ కు సంభందించిన అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.ఇప్పటికే కమిషన్ పలు రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని సేకరించి బ్యాలెట్ బాక్స్ ల ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. జీ హెచ్ ఎం సి ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కమిషన్ సిద్ధం గా ఉందన్నారు. సమయానుసారం ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామని ఆయన తెలిపారు.