YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పీపీఈ కిట్ల‌తో ఓటింగ్

పీపీఈ కిట్ల‌తో ఓటింగ్

నిజామాబాద్, అక్టోబ‌రు 8, 
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ రేపు జరగనుంది. దీంతో అధికారులు ఓటింగ్‌కు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. 2020, అక్టోబర్ 09వ తేదీ శుక్రవారం పోలింగ్ జరుగనుంది. ఇక్కడ 824 మంది ఓటర్లున్నారు. వీరిలో 24 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారిన పడడం కలకలం రేపింది. 24 మందికి కరోనా సోకడంతో వారికి సాయంత్రం 4 నుంచి 5గంటల వరకు ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్‌ కేంద్రాలకు రాని వారు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వేసేందుకు అవకాశం ఇచ్చారు. ఇక పోలింగ్‌ కేంద్రాల వద్ద మాస్కులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచారు.కరోనా సోకిన ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పీపీఈ కిట్లతో అంబులెన్స్‌లలో పోలింగ్‌ కేంద్రాలకు తరలించాలని నిర్ణయించారు. కరోనా సోకిన ఓటర్లను సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించాలని భావిస్తున్నారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద వైద్యారోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతారు. వీరి పర్యవేక్షణలో పోలింగ్‌ కేంద్రాలకు తీసుకెళుతారు.  ఉప ఎన్నిక కోసం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలో మొత్తం 50 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ విధులు నిర్వర్తించనున్న అధికారులు, సిబ్బందికి ఎన్నికల పోలింగ్ కు ఒకరోజు ముందు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఇక్కడ ఎమ్మెల్సీ బరిలో టీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ అభ్యర్థిగా వి.సుభాష్‌రెడ్డి, పి.లక్ష్మినారాయణ బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు.

Related Posts