ఎర్రవల్లిలో ఉద్రిక్తత..
సిద్దిపేట
మల్లన్న సాగర్ ఎర్రవల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో పూర్తిస్థాయి నష్టపరిహారం ఇవ్వకుండా, పూర్తిస్థాయి సర్వే చేయకుండా గ్రామం ఖాళీ చేయాలని బెదిరింపులు వస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం ఉదయాన్నే ఎర్రవల్లి గ్రామంలోకి భారీ సంఖ్యలో పోలీసులు రావడం, వారితో పాటు డీసీఎం వ్యాన్లు రావడంతో గ్రామస్థులు అందోళన చెందుతున్నారు.
ఎర్రవెల్లి గ్రామంలో పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించి, మూత్రాజ్ పల్లి వద్ద డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల తాళాలు ఇచ్చిన తరువాతే వారిని ఖాళీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలను అధికారులు బేఖాతర్ చేస్తున్నారని గ్రామస్తుల ఆరోపన. కేవలం కాంట్రాక్టర్లకు న్యాయం కోసం కాంట్రాక్టర్లతో అధికారులు కలిసి గ్రామస్తులను బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తున్నారని
ఆరోపిస్తున్నారు. గ్రామంలోకి భారీగా పోలీసులు, వ్యాన్లు రావడంతో వారు ఆందోళనకు దిగారు.