న్యూఢిల్లీ అక్టోబర్ 9
లోక్జనశక్తి పార్టీ నేత, కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ భౌతికకాయానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివాళులర్పించారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాశ్వాన్ నిన్న రాత్రి కన్నుమూశారు. ఢిల్లీలోని మంత్రి నివాసానికి వెళ్లిన రాష్ట్రపతి ఆయన పార్థివదేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. పాశ్వాన్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.బీహార్కు చెందిన దళిత నేతగా రామ్విలాస్ ఎనలేని కీర్తిని గడించారు. లోక్జనశక్తి పార్టీని స్థాపించిన ఆయన.. ఎనిమిదిసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గత కొన్ని వారాల నుంచి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పాశ్వాన్ ఇటీవలే గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు.