YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నన్ను టార్గెట్ చేస్తున్న ప్రభుత్వం

నన్ను టార్గెట్ చేస్తున్న ప్రభుత్వం

అనంతపురం అక్టోబర్ 09 
కొంతకాలంగా ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా మౌనంగా ఉంటూ వస్తున్న సీనియర్ రాజకీయ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, హఠాత్తుగా మళ్లీ తెరపైకి వచ్చారు. అనంతపురం జిల్లా తాడిపత్రి గనులు, భూగర్భ కార్యాలయానికి చేరుకున్న జేసీ దివాకర్ రెడ్డి అక్కడి కొద్దిసేపు హల్‌చల్ చేశారు. నియంత పాలన ఇంకా ఎంత కాలం ఉంటుందో చూస్తానని పరోక్షంగా సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తమ గనులకు అనుమతి ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తానని ఆయన అధికారులను హెచ్చరించారు. సున్నపురాయి గనుల లీజు విషయంలో జేసీ దివాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తమకు ఇప్పుడు సన్మానం చేసిన అధికారులకు రెట్టింపు ఫలితం ఉంటుందని వ్యాఖ్యానించారు. దీనికి ఫలితం తప్పక అనుభవించాల్సి వస్తుందని అన్నారు. అనవసరమైన విషయాల్లో కేసులు పెట్టి తమ కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. తన మీద ఎందుకో దయతలచారంటూ సెటైర్లు వేశారు. ఈ ప్రభుత్వంలో అధికారులకు రూల్స్ ఉండవని విమర్శించారు. బదిలీలకు భయపడి తమపై కేసులు పెడుతున్నారని అన్నారు. తాను వస్తున్నానని తెలిసి అధికారులు పారిపోయారని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తాను మళ్లీ సోమవారం వస్తానంటూ వ్యాఖ్యానించారు. కొద్దిరోజుల క్రితం వరకు తన సోదరుడిని టార్గెట్ చేసిన ప్రభుత్వం... ఇప్పుడు తనను టార్గెట్ చేస్తోందని ధ్వజమెత్తారు.

Related Posts