YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సాక్షి పత్రిక, టీవీపై పరువు నష్టం దావా వేస్తా: రఘురామ కృష్ణంరాజు

సాక్షి పత్రిక, టీవీపై పరువు నష్టం దావా వేస్తా: రఘురామ కృష్ణంరాజు

న్యూఢిల్లీ అక్టోబర్ 9  
జగతి పబ్లికేషన్ కేసులో ముగ్గురు ప్రముఖులు జైలుకు వెళ్లే అవకాశం ఉందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యనించారు. సీబీఐ దాడులపై స్పందించిన ఆయన శుక్రవారం ఢిల్లీలో మాట్లాడుతూ వైసీపీ నేతలకు మానసిక సమస్యలు ఎక్కువయ్యాయన్నారు. సీబీఐ దాడులంటూ తనపై దుష్ప్రచారం చేశారని, సాక్షి పత్రిక, టీవీపై పరువు నష్టం దావా వేస్తానని రఘురామ స్పష్టం చేశారు. దీనిపై న్యాయవాదితో సంప్రదించినట్లు చెప్పారు.పిచ్చివాళ్లతో ప్రభుత్వాన్ని నడిపించాలనుకోవడం మంచిది కాదని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. వైవీ సుబ్బారెడ్డి అవినీతిపై ప్రధాని మోదీకి లేఖ రాశానన్నారు. రంగుల విషయంలో న్యాయస్థానాలు సీఎం జగన్ గూబ పగులగొట్టాయన్నారు. ఓట్లు కావాల్సినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలు కావాలని.. గెలిచాక శిరోముండనాలు, దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏడుకొండలు.. ఏడు రెడ్లు అన్నట్లు తిరుమల తయారైందని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.

Related Posts