న్యూఢిల్లీ అక్టోబర్ 10
మోదీ సర్కార్ వీవీఐపీ హెలికాప్టర్ను ఖరీదు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇవాళ రాహుల్ గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. తన ట్విట్టర్లో ఓ వీడియో పోస్టు చేసిన రాహుల్.. మన జవాన్లను నాన్ బుల్లెట్ ప్రూఫ్ ట్రక్కుల్లో యుద్ధానికి పంపుతున్నారు, కానీ ప్రధాని మోదీ మాత్రం 8400 కోట్లతో ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ విమానం తెప్పించుకున్నట్లు ఆరోపించారు. ఇది ఎంత వరకు న్యాయం అని ఆయన ప్రశ్నించారు. రెండు నిమిషాలు ఉన్న వీడియోలో.. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఉన్నా.. నాన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో తమను తరలిస్తున్నట్లు జవాన్లు ఆరోపించారు. వరుసగా రెండవ రోజు రాహుల్ ఈ అంశంలో విమర్శలు గుప్పించారు. గురువారం తన ట్వీట్లో సియాచిన్-లడాఖ్ సైనికులకు ఎన్ని నిత్యావసరాలు కొనవచ్చో చెప్పారు.