YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజధానిని ఎందుకు తరలిస్తున్నారు

రాజధానిని ఎందుకు తరలిస్తున్నారు

అనంతపురం అక్టోబరు 11
రాజకీయ కక్షతో అమరావతి రాజధాని అంశాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. ప్రభుత్వం నిధులు కేటాయించకపోయినా సర్కారు కార్యక్రమాలు కొనసాగుతున్న అమరావతి కాదని వేరే ప్రాంతంలో పరిపాలన తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చివరి ప్రాంతంగా ఉన్న విశాఖలో పరిపాలన ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నిస్తే వైసీపీ నేతల వద్ద సమాధానం దొరకదని, విశాఖలో భవనాలను నిర్మించుకోవాలంటే భారీ నిధులు వెచ్చించాల్సి వస్తాదని చెప్పారు. రాయలసీమకు విశాఖ సుదూర ప్రాంతంగా ఉంటుందని చెప్పారు. ఎన్నికల సమయంలో విశాఖ నుంచి పరిపాలన కొనసాగిస్తామని చెప్పని జగన్ తీరుపై మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అసహనం వ్యక్తం చేశారు.

Related Posts