YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పేదలకు అండగా నిలవడమే తెలంగాణ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం - మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

పేదలకు అండగా నిలవడమే తెలంగాణ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం -  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హైద్రాబాద్ అక్టోబర్ 11
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదలకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో అండగా నిలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.  శనివారం అమీర్ పేటలోని వివేకానంద కమ్యూనిటీ హాల్లో ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.   ఈ సందర్భంగా పలువురు పేద మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నో ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పరిపాలించిన అప్పటికీ పేదలను పట్టించుకున్న దాఖలాలు లేవని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పేద ప్రజలను ఆదుకునేందుకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం నిత్యం పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో అమీర్పేట డివిజన్ కార్పొరేటర్ శేషుకుమారి సనత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీ బాల్రెడ్డి జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ లు అధికారులు పాల్గొన్నారు.

Related Posts