నిజామాబాద్ అక్టోబరు 12,
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో తెరాస అభయర్ది కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. తొలి రౌండ్ లోనే ఆమెను విజయం వరించింది. మొత్తం పోలైన 823 ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు 728 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి లక్ష్మీనారాయణకు 56, కాంగ్రెస్ అభ్యర్థి సుభాష్రెడ్డికి 29 ఓట్లు వచ్చాయి. పది ఓట్లు చెల్లకుండా పోయాయి. కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు గల్లంతయ్యాయి.14వ ఎమ్మెల్సీగా ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నారు. తరువాత కవితకు ఎన్నికల గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అధికారులు అందజేసారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. కవితకు శుభాకాంక్షలు తెలుపుతూ మిఠాయిలు పంచుకున్నారు.