YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అమానుషం.

అమానుషం.

హైదరాబాద్ అక్టోబ‌రు 13, 
నిరుపేదలకు డబుల్ బెడ్ రూములు నిర్మించి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత పేదలకు ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.  ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసారు. అదేవిధంగా అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలను బిజెపి చేపట్టింది. ఎల్ ఆర్ ఎస్ పేరుతో రాష్ట్ర ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ని సంతృప్తిపరచడానికి ముస్లిం సంతుస్టికరణ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ మంగళవారం ఆందోళన కార్యక్రమాలను చేపట్టిందని అయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు నిరంకుశంగా ముందస్తు అరెస్టులు ఆందోళన చేస్తున్నారు. కార్యకర్తలు పైన లాఠీచార్జిలు అమానుషంగా  వ్యవహరించడం, అరెస్టులు చేయడం పట్ల, ఆందోళన కార్యక్రమం చేస్తున్న కార్యకర్తలను అసెంబ్లీ బయట పరిసర ప్రాంతాలలో భౌతిక దాడులకు (మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం) పాల్పడడం పట్ల బిజెపి తీవ్రంగా ఖండిస్తోందని అయన పేర్కోన్నారు.

Related Posts