హైదరాబాద్ అక్టోబర్ 13
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఇవాళ ఒక మహానగరంగా, విశ్వనగరంగా ఎదగడానికి శరవేగంగా అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తుంది అని మంత్రి కేటీఆర్ తెలిపారు. శాసనసభలో జీహెచ్ఎంసీ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ నగరానికి 429 సంవత్సరాల కిందట బీజం పడింది. 1869లో హైదరాబాద్ మున్సిపాలిటీగా, 1933లో చాదర్ఘాట్ అనే మరో మున్సిపాలిటీ, 1937 జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ, 1945లో సికింద్రాబాద్ అనే మున్సిపాలిటీ ఏర్పడింది. 1948-56 మధ్య కాలంలో హైదరాబాద్ స్టేట్గా ఉన్న,ప్పుడే 1955లోనే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడింది. హెచ్ఎంసీ యాక్ట్ కింద నాడు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వాలు సంకల్పించలేదు. కొత్త చట్టం తీసుకురావాలనే ఆలోచన వారికి లేదు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమైన ఐదు సవరణలు చేసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. 2015లో ఒక జీవో ద్వారా కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు 50 శాతం స్థానాలను మహిళలకే ఆమోదించుకున్నాం. మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలనే ఆలోచనతో మహిళా రిజర్వేషన్లకు ఇవాళ చట్టం చేసుకుంటున్నామని తెలిపారు. 79 స్థానాల్లో మహిళలను గెలిపించిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. తెలంగాణలో 5 నుంచి 6 శాతం గ్రీన్ కవర్ పెరిగిందని కేంద్రం ఓ నివేదిక విడుదల చేసింది. గ్రామాల్లో, పట్టణాల్లో హరితహారం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టంలో 10 శాతం బడ్జెట్ను గ్రీన్ కవర్కు కేటాయించామన్నారు. 85 శాతం మొక్కలు బతకాలనే ఉద్దేశంతో అధికారులు, ప్రజాప్రతినిధులకు అప్పజెప్పామన్నారు. పంచాయతీరాజ్, పురపాలక చట్టం మాదిరిగానే జీహెచ్ఎంసీ చట్ట సవరణలో మార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు. కాంక్రీట్ జంగిల్గా మారుతున్న నగరాన్ని హరితనగరంగా మార్చేందుకు ఈ సవరణ ఉపయోగపడుతుందన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే నాలుగు రకాల కమిటీలు తీసుకురాబోతున్నామని తెలిపారు. ఈ కమిటీల్లో 50 శాతం మహిళలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శక్తివంతమైన అస్ర్తంగా ఈ కమిటీలను తయారు చేయబోతున్నామని చెప్పారు. మాటిమాటికి రిజర్వేషన్లు మార్చడం వల్ల ప్రజాప్రతినిధులకు జవాబుదారీ తనం లేకుండా పోతోంది. రెండు టర్మ్లు ఒకే రిజర్వేషన్ ఉండేలా పంచాయతీరాజ్, పురపాలక చట్టంలో తీసుకువచ్చాం. అదే పాలసీని జీహెచ్ఎంసీ యాక్ట్లో చేర్చతున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు.