YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

న్యత్యకారిణి శోభానాయుడు కన్నుమూత

న్యత్యకారిణి శోభానాయుడు కన్నుమూత

న్యత్యకారిణి శోభానాయుడు కన్నుమూత
హైద్రాబాద్,
కూచిపూడి న్యత్యకారిణి శోభానాయుడు మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఒంటి గంట 44 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. 1962లో విశాఖ జిల్లా అనకాపల్లెలో జన్మించిన శోభానాయుడు.. చిన్నవయసులోనే నృత్యకారిణిగా ప్రసిద్ధికెక్కారు. మొదట్లో వెంపటి చిన సత్యం శిష్యురాలుగా అందరికి సుపరిచితమే. వెంపటి నృత్యరూపాలలో అన్ని ప్రధాన పాత్రలనూ పోషించారామె. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో ఆమె రాణించారు.నృత్య కళాకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత శోభానాయుడు ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె వయసు 64 సంవత్సరాలు. దాదాపు నెల రోజుల క్రితం తన ఇంట్లో కాలు జారిపడిన ఆమె తలకు గాయం కాగా, అప్పటి నుంచి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. ఆర్థో న్యూరాలజీ సమస్యతో బాధపడుతున్న ఆమెకు, రెండు వారాల క్రితం కరోనా కూడా సోకినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించి ఆమె కన్నుమూశారు.. కూచిపూడి నృత్య కళాకారిణిగా శోభానాయుడు ఎన్నో రివార్డులు, అవార్డులు అందుకున్నారు. శోభానాయుడు వెంపటి చినసత్యం శిష్యురాలు. సత్యభామ, చండాలిక, పద్మావతి పాత్రల్లో శోభానాయుడు రాణించారు. కూచిపూడి ఆర్ట్ అకాడమీ ప్రిన్సిపల్ గా శోభానాయుడు పనిచేశారు. 2001లో శోభానాయుడుకు పద్మశ్రీ పురస్కారం లభించింది.విశాఖ జిల్లా అనకాపల్లిలో వెంకటనాయుడు, సరోజినీ దేవి దంపతులకు 1956లో జన్మించిన ఆమె, చిన్నప్పటి నుంచీ వెంపటి చిన సత్యం వద్ద కూచిపూడిని అభ్యసించారు. దేశవిదేశాలలో అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చి పేరుతెచ్చుకున్నారు. ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2001లో ఆమెకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.  స్వచ్ఛమైన నృత్యరీతి, అంకితభావం ఉన్న నాట్య గురువుగా గుర్తింపు పొందారు.. హైదరాబాదు లోని కూచిపూడి ఆర్ట్ అకాడమీ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ.. పిల్లలకు శిక్షణ ఇచ్చారు. నాట్యం వృత్తిగా తీసుకున్న ప్రతిభాశాలి శోభానాయుడు.. తన బహుముఖ ప్రతిభకు నిదర్శనంగా 2001 లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. శోభానాయుడు శిష్యులు పలువురు రాష్ట్ర, జాతీయ పురస్కారాలను కూడా అందుకున్నారు. దేశ విదేశాల్లో సుమారు 15 వందల మందికి కూచిపూడి నృత్యంలో శిక్షణ అందించారు. ఇక శోభానాయుడు మృతిపట్ల పలువురు న్యత్యకారులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

Related Posts