YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 అవాస్తవాలతో చంద్రబాబు లేఖలు రాస్తున్నారు విజయవాడ 

 అవాస్తవాలతో చంద్రబాబు లేఖలు రాస్తున్నారు విజయవాడ 

 అవాస్తవాలతో చంద్రబాబు లేఖలు రాస్తున్నారు
విజయవాడ 

 టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖలు రాయడంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైనా ఘటన జరిగితే అవాస్తవాలతో లేఖలు రాస్తున్నారని వ్యాఖ్యానిచ్చారు.వాటిపై విచారణ జరిపితే అవాస్తవంగా తెలుస్తోందని,పొలిటికల్ ఎజెండాతో పోలీసులను వివాదంలోకి తెస్తున్నారని చెప్పారు. ఇటీవల హిందూ దేవాలయాలపై దాడుల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వాళ్లపై చర్యలు తీసుకున్నామని,ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రకాశం జిల్లాలో హోంగార్డ్స్ అభ్యున్నతికి సహకార సంఘాన్ని ప్రారంభించామని చెప్పారు.ప్రకాశం పోలీసులు టెక్నాలజిలో ముందున్నారని,మిగిలిన జిల్లా పోలీసులకు ప్రకాశం పోలీసులు ఆదర్శంగా నిలుస్తున్నార అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో నూతన సాంకేతిక మార్పులు తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని,సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుందని చెప్పారు.ఫిర్యాదు దారుడు పోలీస్ స్టేషన్‌కి రాకుండానే.. సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసుకునే విధంగా చర్యలు చేపట్టామని,రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని,అసాంఘిక శక్తులపై పోలీస్ నిఘా ఉందని,శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు.

Related Posts