YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

లాభాలతో ముగిసిన మార్కెట్లు

లాభాలతో ముగిసిన మార్కెట్లు

స్వల్ప ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ వరుసగా తొమ్మిదో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 90 పాయింట్లు లాభ‌పడి 34,395 వద్ద నిలవగా.. నిఫ్టీ 20 పాయింట్లు పుంజుకొని 10,549 వద్ద స్థిరపడింది. సిరియా కేంద్రంగా అమెరికా- రష్యా మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు చ‌క్క‌బ‌డుతుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. సోమవారం అమెరికా మార్కెట్లు లాభపడగా.. మ‌రో వైపు యూరోపియన్‌ మార్కెట్లు సైతం సానుకూలంగా కదులుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో ప‌వ‌ర్ గ్రిడ్, ఎన్టీపీసీ(1.99%), హిందుస్థాన్ యూనిలీవ‌ర్ లిమిటెడ్(1.83%), ఐసీఐసీఐ బ్యాంక్(1.50%), ఐటీసీ(1.23%) లాభ‌ప‌డిన వాటిలో ముందుండగా మ‌రో వైపు యాక్సిస్ బ్యాంక్(1.78%), స‌న్ ఫార్మా(1.27%), అదానీ పోర్ట్స్(1.24%), విప్రో(1.14%), మారుతి(0.80%), యెస్ బ్యాంక్(0.77%) బాగా న‌ష్ట‌పోయాయి

Related Posts