YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఆక‌తాయిల‌కు ఆన్ లైన్ కౌన్సెలింగ్ హైద్రాబాద్, 

ఆక‌తాయిల‌కు ఆన్ లైన్ కౌన్సెలింగ్ హైద్రాబాద్, 

ఆక‌తాయిల‌కు ఆన్ లైన్ కౌన్సెలింగ్
హైద్రాబాద్, 
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను వివిధ పద్ధతుల్లో వేధించిన 200 మందికి పైగా బాధ్యులను గుర్తించి, వారికి రాష్ట్ర మహిళా భద్రత విభాగం ప్రధాన కార్యాలయం (షీ టీమ్స్) నుంచి ఆన్ లైన్ కౌన్సెలింగ్ నిర్వహించారు. తప్పిదాలు చేసిన బాధ్యుల్లో మార్పు తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ ఆన్ లైన్ కౌన్సెలింగ్‌ను చేపట్టారు. ఈ కార్యక్రమంలో మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. బాధ్యులందరు ఇక మీదట జాగ్రత్తగా మసలుకోవాలని సూచించారు. హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.బాధ్యుల తల్లిదండ్రులు కూడా ఈ కౌన్సెలింగ్‌లో హాజరు కావటంతో వారికి కూడా పలు సూచనలు చేశారు. పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, బాధ్యులు ఒకటి గుర్తెరగాలని మీరు చేసిన తప్పిదాలే రేపు మీ కుటుంబంలోని మహిళలకు కూడా జరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. వేరే వాళ్ళు అలా ఇంట్లోని మహిళలకు చేస్తే ఎలా ఉంటుందని అన్నారు. అందుకని సమాజంలో ప్రతి మహిళను గౌరవించాలని కోరారు. మార్పు మీ నుండే మొదలుకావాలని హితవు పలికారు.కౌన్సెలింగ్‌లో పాల్గొన్న మహిళా భద్రత విభాగం డీఐజీ సుమతి మాట్లాడుతూ.. దేశంలో ఇలాంటి కౌన్సెలింగ్‌కి ఒక విధానమంటూ లేదని మన రాష్ట్రంలోనే ఒక మోడల్ కౌన్సెలింగ్‌ని రూపొందించి, తప్పిదాలకు పాల్పడిన వ్యక్తులను మార్చగలుతున్నామని చెప్పారు. ఇందుకు అన్ని జిల్లాల షీ టీమ్‌లు చేస్తున్న కృషి మరువలేదని చెప్పారు. ప్రతి జిల్లా షీ టీమ్ మహిళల సమస్య పట్ల చాలా వేగంగా స్పందిస్తున్నారని ఇదే వేగం కొనసాగించాలని అన్నారు.ఈ కౌన్సెలింగ్‌లో ప్రముఖ సైకాజిస్టులు కూడా పాల్గొని బాధ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రముఖ విద్యావేత్త, ఫ్లేమ్ వ్యవస్థాపకురాలు డాక్టర్ ఇందిరా పారిఖ్ కూడా పాల్గొని బాధ్యుల్లో మార్పునకు కొన్ని సూత్రాలు చెప్పారు. అలాగే ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ గీతా చల్లా పాల్గొని బాధ్యులతో కొన్ని ప్రయోగాత్మక విధానాలను అవలంబిస్తూ తప్పును తెలుసుకొని వారిలో మార్పు వచ్చేలా చేశారు. ఇందులో కొంత మంది వ్యక్తులు తమలో మార్పు వచ్చిందని, జిల్లా షీ టీమ్‌లు పరివర్తన తెచ్చేదిశగా ఎంతో ప్రయత్నం చేశాయని చెప్పారు. ఇక మీదట ఇలాంటి తప్పిదాలకు పాల్పడబోమని వారు వివరించారు.

Related Posts