YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ప్రేమను తిరస్కరించిందనే కోపంతో కత్తితో దాడి        చికిత్స పొందుతూ యువతి మృతి

ప్రేమను తిరస్కరించిందనే కోపంతో కత్తితో దాడి        చికిత్స పొందుతూ యువతి మృతి

ప్రేమను తిరస్కరించిందనే కోపంతో కత్తితో దాడి
       చికిత్స పొందుతూ యువతి మృతి
విజయవాడ 
ప్రేమోన్మాదానికి యువతి బలైంది. తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన యువతి చికిత్స పొందుతూ మరణించింది. తర్వాత ఉన్మాది తనను తాను కత్తితో గాయపరుచుకున్నాడు.. ఈ ఘటన విజయవాడ మాచవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని క్రీస్తురాజపురంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. క్త్రీస్తురాజపురం ప్రాంతానికి దివ్యతేజస్విని అనే యువతి ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతోంది. విజయవాడలో పేయింటర్‌గా పని చేసే స్వామి అనే యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే అతని ప్రేమను ఆమె తిరస్కరించింది. గురువారం క్రీస్తురాజపురంలోని యువతి ఇంటికి గురువారం యువకుడు వచ్చాడు.ఈ సందర్భంగా యువతి, యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ప్రేమను అంగీకరించకపోవడంతో దీంతో కోపోద్రిక్తుడైన యువకుడు కత్తితో ఆమెపై దాడి చేశాడు. మెడపై తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న యువతిని విజయవాడలోని ఈఎస్‌ఐ హాస్పిటల్‌కు తరలించారు. తీవ్ర గాయం కావడంతో గుంటూరు హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. కాగా, నిందితుడు సైతం యువతిపై దాడి చేసిన అనంతరం ఆత్మహత్యకు యత్నించాడు. తన రెండు చేతులను కోసుకోవడంతో అక్కడే కుప్పకూలాడు. నిందితుడు స్వామిని సైతం గుంటూరు హాస్పిటల్‌లో తరలించగా, చికిత్స పొందుతున్నాడు. గత రెండు రోజుల కిత్రం విజయవాడలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. విస్సన్నపేటకు చెందిన చిన్నారి అనే యువతి, విజయవాడలోని ఓ కొవిడ్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తున్నది.  హాస్పిటల్ కు సమీపంలో ఓ రూమ్ అద్దెకు తీసుకొని స్నేహితులతో కలిసి ఉంటోంది. అయితే, గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతానికి చెందిన నాగభూషణం అనే యువకుడు ప్రేమించాలని వెంటపడ్డాడు. దీనికి ఒప్పుకోలేదు. వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇకపై వేధించనని చెప్పడంతో కేసును వాపస్‌ తీసుకుంది. సోమవారం రాత్రి సమయంలో విధులు ముగించుకొని వస్తున్న చిన్నారిని అడ్డగించి వాదనకు దిగాడు. పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. దీంతో చిన్నారి అక్కడికక్కడే మరణించింది.  ఆ మంటలు యువకుడికి కూడా అంటుకోవడంతో గాయపడ్డాడు. ప్రస్తుతం గుంటూరులోని ప్రభుత్వ హాస్పిటల్‌ చికిత్స పొందుతున్నాడు.

Related Posts