దుబ్బాకలో మాటల మంటలు
మెదక్,
ఉప ఎన్నిక అయినా సరే.. అక్కడ హరీశ్ రావు ఉంటే ఆ లెక్క వేరే. టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న లీడర్ మినిస్టర్ హరీశ్ రావు. ఇక సిద్ధిపేట జిల్లాలో జరిగే ఉప ఎన్నిక కావడంతో హరీశ్ రావు సవాల్ గా తీసుకున్నారు. అన్నీ తానై తిరుగుతున్నారు. సోలిపేట సుజాత నిలబడ్డా.. గెలిచేదీ.. గెలిపించేదీ హరీశ్ రావే అన్నట్లుంది
ఎవ్వారం. నేనుంటే గెలుపు కాదు.. మెజార్టీ కోసమే ప్రచారం అన్నట్లు తిరుగుతున్నారు హరీశ్ రావు. గెలవడం ఎలాగూ కన్ఫామ్ కాబట్టి.. మెజార్టీ ఓట్లు ఎన్ని వస్తాయా అనే దానిపై ఫోకస్ చేశారు అనే టాక్ నడుస్తోంది. ఇక బీజేపీ కూడా ఇదే నియోజకవర్గాన్ని సీరియస్ గా తీసుకుంది. ఫైట్ లో నుంచుంది కూడా రఘు నందన్ కావడంతో ఫైట్ కాస్త టఫ్ గానే ఉంది. రఘునందన్ కూడా గెలుపు కన్ఫామ్ అన్నట్లే ఉన్నారు. బీజేపీకి పట్టు ఉండడం.. రఘునందన్ కి కాస్త పాపులారిటీ ఉండడంత్ వర్కవుట్ అవుతుంది అనుకుంటోంది ఆ పార్టీ. సెంట్రల్ నుంచి బీజేపీ సర్కార్ ఇస్తున్న పథకాల్ని ఇక్కడ తామిస్తున్నట్లుగా మసిపూసి మారేడు కాయ చేస్తున్నారని బీజేపీ కామెంట్స్ చేస్తోంది. అంత సీన్ లేదు అంతా మేమే ఇస్తున్నాం అంటూ టీఆర్ఎస్
అటాక్ చేస్తోంది. నియోజక వర్గంలో లీడర్లే లేక.. బయటి నియోజకవర్గాల నుంచి వచ్చి ప్రచారాలు చేస్తున్నారని హరీశ్ కామెంట్ చేయగా.. అలా అంటే.. హరీశ్ రావుకి కూడా నియోజకవర్గంతో సంబంధం లేదనీ.. ఆయన కూడా బయటినుంచి వచ్చిన వారే అంటూ కౌంటర్ ఇచ్చారు రఘు నందన్. దుబ్బాక నియోజక వర్గంలో నుంచోవడం అంటే.. ఫైట్ చేసేది అక్కడి
లీడర్లతో కాదు.. హరీశ్ రావుతో అనే విషయంలో మిగతా లీడర్లకి కూడా క్లారిటీ వచ్చింది. మిగతా వాళ్లు కూడా గెలుపు కోసం ఫైట్ చేస్తున్నా.. మెయిన్ గా మాత్రం.. హరీశ్ రావు.. రఘునందన్ కి మధ్యే పోటీ నడుస్తోంది. స్క్రూటినీ కూడా అయిపోవడం మొత్తం 23 మంది బరిలో నుంచోడంతో ఓట్లు చీలే ఛాన్స్ కూడా బానే ఉంది. చీలిన ఓట్లు చీలినా ఉన్న ఓటు బ్యాంకు
జారిపోకుండా చూసుకుంటున్నారు లీడర్లు.