YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

వివాహిత ఆత్మహత్య విశాఖపట్నం 

వివాహిత ఆత్మహత్య విశాఖపట్నం 

 

వివాహిత ఆత్మహత్య
విశాఖపట్నం 
విశాఖ శివారు అగనంపూడిలో ఓ మహిళ అనుమానాస్పద మృతి చెందింది.మృతురాలి ఒంటిపై గాయాలు కనిపించడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.శ్రీకాకుళం జిల్లా ఎడ్చర్ల కు చెందిన బండి లక్ష్మణ్,రామలక్ష్మి దంపతులు అగనంపూడి లో నివాసముంటున్నారు.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.లక్ష్మణ్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు.  వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో రామలక్ష్మి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు సమాచారం రావడంతో దువ్వాడ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి ఒంటిపై గాయాలు కనబడడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త లక్ష్మణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్ళైన తర్వాత కొన్నాళ్ల పాటు ఫార్మా కంపెనీకి దగ్గర్లోని పరవాడ లో నివాసమున్నారు. ఇటీవల కరోనా వ్యాప్తి నేపథ్యంలో అక్కడ ఇల్లు ఖాళీ చేసి మళ్లీ సొంతూరు ఎడ్చర్ల వెళ్లిపోయారు. నెల రోజుల క్రితం అగనంపూడిలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు.భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడడంతో ఆమె మృతి చెందినట్లు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు.ఇరువురి కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు

Related Posts