YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

దుర్గమ్మ ను దర్శించుకున్న ఎంపీ నాని

దుర్గమ్మ ను దర్శించుకున్న ఎంపీ నాని

ఇంద్రకీలాద్రి అక్టోబర్ 21 
విజయవాడ పార్లమెంటు సభ్యులు  కేశినేని నాని కుటుంబ సమేతంగా సరస్వతీదేవిగా కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను మూల నక్షత్రం రోజున దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ -  ఆనవాయితీగా వస్తున్న ఆచారం పాటిస్తూ మూలనక్షత్రం రోజు ఉదయం అమ్మవారిని దర్శించుకుని, ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.  కరోనా నేపథ్యంలో ప్రపంచమంతా విలవిలాడుతోంది. అమ్మ వారే ప్రపంచ మానవాళిని రక్షిస్తూ, త్వరగా బయట పడేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.  అమ్మవారి కృపాకటాక్షాలు, ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు.

Related Posts