YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

సీబీఐకి మహారాష్ట్ర ప్రభుత్వం షాక్

సీబీఐకి మహారాష్ట్ర ప్రభుత్వం షాక్

ముంబై‌, అక్టోబ‌రు 22, 
సీబీఐకి మహారాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సీబీఐకి ఇచ్చిన సాధారణ అనుమతిని బుధవారం ఉపసంహరించుకుంది. దీంతో ఆ రాష్ట్రంలో సీబీఐ కేసుల దర్యాప్తునకు ఆటంకం ఏర్పడనుంది. తాజా నిర్ణయంతో ఏదైనా కేసులో దర్యాప్తు చేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీబీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కేసును తీవ్రతను బట్టి అనుమతి ఇవ్వాలా? వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇప్పటికి పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాలు సీబీఐకి సాధారణ అనుమతిని ఉపసంహరించుకున్నాయి.బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్న వేళ, బిహార్ ప్రభుత్వం సిఫార్సుతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. కానీ, తాజాగా మారిన పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టీఆర్పీ కుంభకోణం కేసులో దర్యాప్తు చేపట్టాలని యూపీ పోలీసుల విజ్ఞ‌ప్తితో సీబీఐ రంగంలోకి దిగింది. ఈ కేసును సీబీఐ చేపట్టిన మర్నాడే మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వెలువడటం గమనార్హం.తాజా నిర్ణయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న విబేధాలు తారాస్థాయికి చేరాయి. రిపబ్లిక్ టీవీ, మరో నాలుగు ఛానెళ్ల రేటింగ్‌ల కోసం అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ముంబై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎం ముఖ్య సలహాదారు అజయ్ మెహతా, అదనపు ముఖ్య కార్యదర్శి ఆశిష్ కుమార్ సింగ్‌తో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం 1946 ప్రకారం.. సీబీఐ దర్యాప్తునకు ఒక రాష్ట్రం అనుమతి తప్పనిసరి.

Related Posts