YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

విషాదాంతంగా మిగిలిన కిడ్నాప్

విషాదాంతంగా మిగిలిన కిడ్నాప్

మహబూబాబాద్ అక్టోబరు 22 
మహబూబాబాద్ జిల్లా లో సంచలనం సృష్టించిన కిడ్నాప్ ఘటన విషాదాంతంగా ముగిసింది. కేసముద్రం మండలం అన్నారం  దానమయ్య గుట్టలో బాలుడు దీక్షిత్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మరణ వార్త విని తల్లిదండ్రలు కన్నీరుమున్నీరయ్యారు. గురువారం తెల్లవారుజామున నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, దర్యాప్తు ముమ్మరం చేసారు. బాలుడిని కిడ్నాప్ చేసిని నిందితులు  45 లక్షలు డిమాండ్ చేసారు. బాలుడిని కిరాతంకంగా పెట్రోల్ పోసి హతమార్చారు. కిడ్నాప్ చేసిన గంట లోనే బాలుడిని గొంతు పిసికి చంపారని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. కిడ్నాప్ కేసు నమోదు కాగానే దాదాపు వంద మంది పోలీసులు రంగంలోకి దిగారు.  వరంగల్, హైదరబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దీక్షిత్ కోసం గాలించారు. నిందితుడు మంద సాగర్ ను పోలీసులు విచారిస్తున్నారు. 

Related Posts