YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ప‌క్కా ప్లాన్ తోనే మ‌త్తిచ్చి దోపిడీ

ప‌క్కా ప్లాన్ తోనే మ‌త్తిచ్చి దోపిడీ

హైద్రాబాద్, అక్టోబ‌రు 23, 
భార్యాభర్తలంటూ ఇంట్లో పనిమనుషుల్లా చేరి ఆ ఇంటికే దోచేస్తున్నా ఓ ప్రియుడు ప్రియురాలు. గత సోమవారం రాత్రి నాచారం హెచ్ ఎంటీ నగర్ లో నివసిస్తున్న ఓ వృద్ధురాలికి మత్తు మందిచ్చి రూ.10 లక్షల నగదు 18 తులాల బంగారం, 40 తులాల వెండిని దోచేసిందో ముఠా. ఈ ఘటనపై రాచకొండ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ చోరీలో ముగ్గురి హస్తం ఉందని గుర్తించారు. ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించగా ఆశ్చర్యం కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి.నేపాల్ కు చెందిన ‘‘కైలాలీ’ అనే దొంగల ముఠా పక్కా ప్లాన్ తో చోరీలు చేస్తోంది. ఇంటిలో ఇద్దరు ఉండే ఇళ్లనే టార్గెట్ చేసుకుని భార్యాభర్తలని చెప్పి ఇంటిలో పనిమనుషుల్లా చేరతారు. తరువాత అదను చూసి మొత్తం ఇంటిని దోచేస్తారు. అలా వారి ప్లాన్ లో భాగంగా..నాచారం హెచ్ ఎంటీ నగరంలో 15 రోజుల క్రితం ఓ ఇంటిలో అర్జున్ అనే 28 యువకుడు మాయ అనే 26ఏళ్ల యువతి భార్యాభర్తలమని చెప్పి పనిమనుషులుగా చేరార కానీ వాళ్లు భార్యాభర్తలు కాదు ప్రియుడు ప్రియురాలు.ఆ ఇంటిలో చేరితో చక్కగా గిట్టుబాటు అవుతుందని..ఆ ఇంటిలో పని మనుషుల అవసరం ఉందని బ్రోకర్ ద్వారా ముందే తెలుసుకుని పక్కా ప్లాన్ తో చేరారు. అర్జున్ కు అప్పటికే పెళ్లి అయ్యింది. భార్య నేపాల్ లో ఉంటుంది. ప్రియురాలు మాత్రం బెంగుళూరులో ఉంటుంది. నేపాల్ నుంచి భార్యను తెచ్చుకోవటానికి చాలా టైమ్ పడుతుందని బెంగళూరులో ఉండే ప్రియురాలినే భార్య అని చెప్పి ఇంటిలో చేరాడు.వాళ్లు ఇంటిలో చేరాక నేపాల్ నుంచి ఈ కైలాలీ ముఠా ప్రధాన సూత్రధారి గోవింద్ వచ్చి వారిద్దరినీ కలిసాడు. ఇంటిలో చోరీ ఎలా చేయాలి? ఎటువంటిసమయంలో చేయాలి? ఏమేమి చోరీ చేయాలి? అన్నీ దోచుకున్నాక ఎవరికీ చిక్కకుండా హైదరాబాద్ నుంచి నేపాల్ ఎలా చేరుకోవాలి? అనే కీలక మైన విషయాలన్నీ చెప్పి వెళ్లిపోయాడు.

Related Posts