హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ వరకు జరుగుతున్న డబుల్ రైల్వే లైన్ పనులు పూర్తయితే గంటన్నరలో హైదరాబాద్ చేరుకోనే అవకాశం ఉంటుంది. మహబూబ్నగర్ జిల్లా ప్రజల చిరకాల కోరిక వచ్చే డిసెంబర్ నాటికి కలసాకారం కానుంది. జిల్లాలోని దివిటిపల్లి గ్రామం నుండి రాజాపూర్ వరకు జరుగుతున్న రైల్వే లైన్ పనులను పరిశీలించారు. డబుల్ లైన్ పనులు పరిశీలించిన తర్వాత అధికారులకు పలు సూచనలు చేసిన చేశారు. రూ.1,207 కోట్ల నిధులు రైల్వే డబ్లింగ్ పనులు, విద్యుద్ధీకరణకు మంజూరయ్యాయన్నారు. మొత్తం 100 కిలోమీటర్ల రైల్వే లైన్లో 25 కిలోమీటర్ల లైన్ ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి చేసి డెమో రైలు ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు నిధుల కొరత లేదని.. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ లైన్లో 154 చిన్న బ్రిడ్జిలు, 9 పెద్ద బ్రిడ్జిల పనులు చురుకుగా సాగుతున్నాయి జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న డబుల్ లైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. దివిటిపల్లి రైల్వే స్టేషన్ పక్కనే ఐటీ కారిడార్, మల్టిపుల్ పరిశ్రమలు వస్తున్నందున ఈ స్టేషన్ను జంక్షన్గా ఏర్పాటు చేస్తూ మోడ్రన్ రైల్వేస్టేషన్గా అభివృద్ధి కానుంది.