YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

15 రోజుల్లో రేషన్ కార్డులు

15 రోజుల్లో రేషన్ కార్డులు

పశ్చిమ గోదావరి  జిల్లాలో అర్హులైన పేదలందరికీ 15 రోజుల్లో తెల్ల రేషన్‌కార్డులు అందించ నున్నారు.  అర్హులైన ప్రతి పేద కుటుంబానికీ తెల్ల రేషన్‌కార్డు అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు కలెక్టర్ విజయ్ భాస్కర్. రాబోయే 15 రోజుల్లో అర్హులందరికీ తెల్లరేషన్‌ కార్డులు అందించి పేదలకు నూరుశాతం తెల్ల రేషన్‌కార్డులు అందించిన ఘనత పశ్చిమకు దక్కేలా చూడాలని డిఎస్‌ఒను ఆదేశించారు. తహశీల్దార్‌ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న అన్ని తెల్ల రేషన్‌ కార్డు దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను రెండు రోజుల్లో సిద్ధం చేయాలనానరు. జిల్లాల్లో అన్ని మంచినీటి చెరువులను యుద్ధప్రాతిపదికపై నీటితో నింపడానికి గ్రామస్ధాయిలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వేసవిలో ఎక్కడా కూడా తాగునీటి ఇబ్బంది అనే మాట విన్పించరాదన్నారు. అవసరమైతే ప్రత్యేక మోటర్లు ద్వారా నీటిని చెరువుల్లోకి మళ్లించాలని ఆదేశించారు. జిల్లాలో రబీ పంట చేతికొచ్చిన దృష్ట్యా రైతులకు పూర్తిస్థాయిలో గిట్టుబాటు ధర కల్పించడానికి కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. రైతుకు 48 గంటల్లో సొమ్ము చెల్లింపులు జరిగేలా ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. అగ్నిమాపక యంత్రాలు పూర్తి కండీషన్‌తో ఉంచాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో తహశీల్దార్లు ప్రజల దాహార్తి తీర్చడానికి ప్రత్యేక చలివేంద్రాలు నెలకొల్పాలని కలెక్టర్‌ ఆదేశించారు. వేసవిలో సాధ్యమైనంత వరకు ప్రజలు సుదూర ప్రయాణాలను ఉదయం వేళల్లో, లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే చేయాలి తప్ప మండు వేసవిలో ప్రయాణాలు చేయవద్దని సూచించారు. 

Related Posts