సింహాచలం సింహాద్రి నాధుని నిజరూప దర్శనానికి కేటయించిన వీఐపీ పాసు ల విషయం లొ ఎం పీ, ఎం ఎల్ ఏ లే మండి పడ్డారు. ప్రోటోకాల్ పాసులు దుర్వినియోగం చేస్తున్నారు అని బండారు సత్యనారాయణ మూర్తి మండి పడ్డారు, సామాన్యప్రజలను అవస్ధలకు గురిచేస్తే సహించేదిలేదన్నారు. ప్రోటోకాల్ పాసులు ఎవరెవరికి ఇచ్చారో జాబితా బైటకు తీయిస్తా అని, సిసి ఫుటేజి దృశ్యాలు తెప్పించి, ఎవరు వీఐపిలో తేలుస్తామనీ మండిపడ్డారు. తమకు ప్రోటోకాల్ పాసులు అందలేదని, తాము కూదా టిక్కెట్లు కొనుక్కొని సామాన్యభక్తుల్లా వచ్చామని తెలిపారు. ప్రజలు తాము వీఐపి సౌకర్యాలు పొందుతున్నామనే అపోహలులో ఉన్నారని తెలియజేశారు. విశాఖలోని సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఆయన కుటుంబ సమేతంగా వచ్చి స్వామిని దర్శించుకున్నారు. ప్రోటోకాల్ పాసుల విషయంలో గతంలో కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం జరిగేది. ఇప్పుడు అలాంటిదేదీ జరగలేదు.. ఇక్కడ కేవలం దేవస్థానం ఈఓ కొటరీతొనే జరిగిందన్నారు. ఈ అలయం లో అతను కూడా ఉద్యొగే అని, ఇదేదో సొంత జాగీర్ లా వ్యవహరిస్తున్న దాఖాలాలే ఉన్నాయని కొందరు ప్రజా ప్రతినిధులు అవేదన వ్యక్తం చేసారు. అంత పెద్ద తిరుమల లోనే పద్దతి ప్రకారం అన్నీ జరుగుతున్నాయని అయన అన్నారు. సింహాచలంలో పద్దతులు పాటించడానికి అడ్డంకులేంటి అని ప్రశ్నించారు.