హైదరాబాద్లో సీపీఎం జాతీయ మహాసభల ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి మాట్లాడుతూ దేశంలో మతోన్మాదం పెరిగిపోతుంది. అవినీతి, అక్రమాలు పెరిగాయన్నారు. మతోన్మాదుల దాడులను అడ్డుకునే శక్తి వామపక్షాలకు మాత్రమే ఉందని, వర్గ, సామాజిక పోరాటాల కోసం కలిసి పనిచేయాలని అన్నారు. దేశంలో దళితులు, ముస్లింలపై దాడులు పెరిగిపోయాయని, ఇటువంటి మతోన్మాదం వల్ల దేశ ఐక్యతకు ముప్పు వాటిల్లుతుందని అయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులు కలవాలని అన్నారు. దేశంలో వ్యవసాయం సంక్షోభంలో పడిందని, నిరుద్యోగం పెరిగిపోయిందని, మరోవైపు కేంద్ర సర్కారు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని అన్నారు. లక్షల కోట్లన్లు కార్పొరేట్ లకు దోచిపెడుతున్నారు. దళితులు, ముస్లిం లను టార్గెట్ చేశారు. ఇది దేశ ఐక్యతకు పెద్ద దెబ్బ అని అయన అన్నారు. వర్గ పోరాటాలు, సామాజిక పోరాటాలు కలిసి పనిచేయాలి. ఐక్య ఉద్యమాలకు 22 జాతీయ మహాసభలు దిశ నిర్దేశం చేస్తాయని అయన అన్నారు.