YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

21 వ డివిజన్ వైకాపా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

 21 వ డివిజన్ వైకాపా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు గ్రామీణ నియోజవర్గ పరిధిలోని  21 వ డివిజన్  కార్యకర్తల సమావేశం  స్థానిక మాగుంట లేఅవుట్ ప్రాంతంలో ఉన్న   డి.ఎస్.ఆర్. గెస్ట్ ఇన్ లో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నెల్లూరు గ్రామీణ నియోజవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలతో ముఖాముఖీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పార్టీ అధిక మెజారిటీతో గెలిచేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు చేయూత నివ్వాలని పిలుపునిచ్చారు. ఆయనవెంట రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Related Posts