YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రోజాకు కట్టలు తెంచుకుంటున్న కోపం

రోజాకు కట్టలు తెంచుకుంటున్న కోపం

రోజాకు కట్టలు తెంచుకుంటున్న కోపం
తిరుపతి, నవంబర్ 4,
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మౌనంగా భరిస్తున్నారు. తనకు తన నియోజకవర్గంలోనే అన్యాయం జరుగుతున్నా ఆమె పెదవి విప్పడం లేదు. ఎప్పుడో ఫైర్ బ్రాండ్ బరస్ట్ అవుతారన్న టాక్ వైసీపీలో టాక్ నడుస్తుంది. నగరి ఎమ్మెల్యేగా రోజా రెండోసారి గెలిచారు. అయితే తొలిసారి గెలిచినప్పుడే రోజా ఆనందంగా ఉండేవారట. ఇప్పుడు తన పార్టీ అధికారంలో ఉన్నా ఎమ్మెల్యేగా ఉండి ఏమీ చేయలేకపోతున్నారు. అదే ఆవేదన రోజాలో కన్పిస్తుంది.ఆర్కే రోజా టీడీపీ నుంచి వైసీపీ లో చేరినా జగన్ కు అత్యంత నమ్మకమైన నేతగా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ కు ఒకరకంగా కుడిభుజంగా వ్యవహరించారనే చెప్పాలి. అసెంబ్లీలోనూ రోజా అప్పటి అధికార పార్టీపై విరుచుకుపడటంతో ఏడాది పాటు సస్పెండ్ కు కూడా గురయ్యారు. ఇక రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా రోజా వెళ్లి అక్కడ పార్టీ తరుపున నిలిచేవారు. సినీ గ్లామర్ కూడా తోడవ్వడంతో రోజా పర్యటనలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విజయవంతమయ్యాయి.ఇది గుర్తించిన జగన్ రోజాను అనేక కార్యక్రమాలకు తానే స్వయంగా ఫోన్ చేసి వెళ్లమని చెప్పేవారట. రోజా కాదనకుండా అటెండ్ అయి వచ్చేవారు. అలాంటి రోజాకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కష్టాలు ఎక్కువయ్యాయంటున్నారు. నగరి నియోజకవర్గంలో తన మాట చెల్లుబాటు కాకుండా చేస్తుండటం ఆమెకు మింగుడపడటం లేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటపడినా ప్రయోజనం లేదని సన్నిహితులు వారించడంతో రోజా మౌనం వహిస్తున్నారని చెబుతున్నారు.రోజా మనస్తత్వానికి తనకు అన్యాయం జరిగితే ఊరుకోరు. వెంటనే కడిగి పారేస్తారు. అలాంటిది తన ప్రత్యర్థికి ఈడిగ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి లభించినా రోజా మౌనంగా ఉంటున్నారు. ప్రతి విషయాన్ని జగన్ వద్దే తేల్చుకుంటానని చెప్పే రోజా ఇప్పుడు ఆ మాట మాట్లాడటం కూడా మానుకున్నారు. జగన్ కు తెలిసే అంతా జరుగుతుందని భావించిన రోజా సమయం కోసం వెయిట్ చేస్తున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మొత్తం మీద రోజా బరస్ట్ అయ్యే రోజు త్వరలోనే ఉందని చెబుతున్నారు

Related Posts