YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఛలో ఆర్మూరుకు భారీ బందోబస్తు

ఛలో ఆర్మూరుకు భారీ బందోబస్తు

ఛలో ఆర్మూరుకు భారీ బందోబస్తు
నిజామాబాద్ నవంబర్ 4,
నిజామాబాద్ జిల్లా లో చలో ఆర్మూర్ మహా ధర్నాకు  పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. రైతులు ఆందోళన చేసినా సమయ స్ఫూర్తి కోల్పోవద్దని పోలీస్ అధికారులు సిబ్బందికి సూచించారు. నలుగురు ఏసీపీలు, తొమ్మిది మంది సిఐలు, ఎస్సైలు కలిపి 300 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసారు. మామిడిపల్లి చౌరస్తాలో రహదారిని దిగ్బంధించడానికి రైతులు సంసిద్దం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ రైతాంగ సమస్యలపై ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి గ్రామ కమిటీల  మద్దతు లభించింది. సన్నధాన్యానికి 2500, పసుపు పంటకు మద్దతు ధర కోసం పోరాటం, నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు.

Related Posts