YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దుబ్బాకలో మాదే ఘన విజయం

దుబ్బాకలో మాదే ఘన విజయం

దుబ్బాకలో మాదే ఘన విజయం
న్యూఢిల్లీ నవంబర్ 4,
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలవబోతోందని టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య తెలిపారు. సీఎం కేసీఆర్ గత ఆరు సంవత్సరాలుగా ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారన్నారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టును కట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గతంలో జరిగిన అన్ని రకాల ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలిచిందన్నారు. బీజేపీ నిరాశ, నిస్పృహతో తమ దళిత ఎమ్మెల్యే క్రాంతిపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని బడుగుల లింగయ్య యాదవ్ పేర్కొన్నారు. బీజేపీ నేతల దగ్గర పోలీసులకు దొరికిన డబ్బును కూడా వారి కార్యకర్తలే ఎత్తుకెళ్లారని ఎంపీ బడుగుల లింగయ్య తెలిపారు. తెలంగాణలో తమకు ప్రజలే బాసులన్నారు. డబ్బును విచ్చలవిడిగా వెదజల్లి, ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే ఘటనలకు పాల్పడ్డారన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు పెద్దగా సహాయం అందడం లేదని లింగయ్య పేర్కొన్నారు. మిషన్ కాకతీయకు 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినప్పటికీ.. పట్టించుకోలేదన్నారు. జీఎస్టీ నిధుల కోసం టీఆర్ఎస్ ఎంపీలందరం పార్లమెంట్‌లో కలిసి పోరాడామని బడుగుల లింగయ్య యాదవ్ వెల్లడించారు.

Related Posts