తూర్పు లడఖ్లో వాస్తవ నియంత్రణ రేఖ వెంట ఉద్రిక్తలను తొలగించేందుకు ఇండియా, చైనా కమాండర్స్ స్థాయి చర్చలు ఈ వారంలో జరుగనున్నాయి. ఈ నెల 6న లేదంటే 8న చర్చలు జరునున్నట్లు అధికారులు ధ్రువీకరించారు. ఇంతకు ముందు అక్టోబర్ 12న జరిగిన చివరి, అంతకు ముందు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఏప్రిల్కు ముందు ఏ పరిస్థితులు ఉండేవో.. అలాంటి వాతావరణాన్నే కల్పించాలని, ఉద్రిక్తతలను తొలగించడానికి చైనానే తొలి అడుగు వేయాలని భారత్ తేల్చిచెప్పింది. దీనికి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారులు ఏ మాత్రం అంగీకరించలేదు. పాంగాంగ్ దక్షిణ ఒడ్డు నుంచి భారతదేశం మొదట వైదొలగాలని చైనా మొండిగా వాదించింది. దీన్ని భారత్ వ్యతిరేకించింది. ఓ వైపు చర్చలంటూనే డ్రాగన్ దేశం మరో వైపు యుద్ధ సన్నాహాలు చేస్తోంది. దీంతో మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు దేశాల భూభాగాలపై పెద్ద ఎత్తున సైనికులను వ్యూహాత్మక, సమస్యాత్మక ప్రాంతాల్లో రెండు దేశాలు భారీగా యుద్ధ సామగ్రిని తరలించాయి. ఈ ఏడాది జూన్లో భారత్ - చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 40 మంది భారత సైనికులు మృతి చెందారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.