YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు తెలంగాణ

సబ్సిడీ బియ్యం పట్టివేత

సబ్సిడీ బియ్యం పట్టివేత

మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న సబ్సిడీ బియ్యాన్ని పట్టుకుని ఆరుగురుపై కేసు నమోదు చేశామని మీడియా సమావేశంలో జిల్లా యస్ పి నంద్యాల కోటి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు అదిస్తున్న 200 క్వింటాల సబ్సిడీ బియ్యన్ని తరలిస్తున్న ఒక లారీ, బోలోరో ట్రాలీ వాహనాలను, 5 సెల్ ఫోన్లు మరియు 6 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ బియ్యాన్ని చుట్టూ ప్రక్కల ప్రాంతంలో ప్రజల వద్ద నుండి తక్కువ రేటుకు కొనుగోలు చేసి గార్ల నుండి ఖమ్మం తరలిస్తున్నారని పక్క సమాచారంతో పట్టుకున్నామని , ఇంకో ముగ్గురు నిందుతులు పరారీలో ఉన్నారని, వారిని కూడ త్వరలో అరెస్ట్ చేస్తామని, పట్టుపడ్డ వారిలో ముగ్గురు రేషన్ డీలర్లు ఉన్నారని, వారి డీలర్ షిప్ రద్దు చేస్తామన్నారు. ఈ బియ్యం సివిల్ సప్లయ్ డిపార్టుమెంటుకు అప్పగిస్తామని అన్నారు. దీనిని పట్టుకోవడానికి కృషి చేసిన పోలీసులను యస్ పి అభినందించారు.

Related Posts