YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు తెలంగాణ

గిరిజన యువతి కోటేశ్వరినీ అత్యాచారం హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి - డిసిపి నారాయణ రెడ్డి కి వినతి పత్రం

గిరిజన యువతి కోటేశ్వరినీ అత్యాచారం హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి - డిసిపి నారాయణ రెడ్డి కి వినతి పత్రం

హుజూర్ నగర్ కు చెందిన గిరిజన యువతి కోటేశ్వరి ఎగ్జామ్ కోసం భువనగిరి మీదుగా హైదరాబాద్ బయలు దేరిన సమయంలో మార్గమధ్యంలో ఘట్కేసర్ సమీపంలో కోటేశ్వరుని దుండగులు అత్యాచారం హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని
కోరుతూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బుధవారం
 భువనగిరి డిసిపి నారాయణ రెడ్డి కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లగొర్ల మోదీ రాందేవ్ యాదవ్ మాట్లాడుతూ గిరిజన యువతిని రేప్ చేసిన దుండగులను ఎన్కౌంటర్ చేయాలని ,
దిశ కు జరిగిన న్యాయ మే ఈ గిరిజన మహిళకు జరగాలని డిమాండ్ చేశారు. దుండగులను ఎన్కౌంటర్ చేసి గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని , రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ,దేశంలో  గంటకు 82 అత్యాచారాలు అవుతున్నాయి అత్యాచారాలలో రాష్ట్రం మూడో స్థానంలో ఉండటం సిగ్గుచేటు గా భావించాలని , రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తుంది ఆవేదన వ్యక్తంచేశారు.
 ప్రభుత్వానికి చేత కాకుంటే దుండగులను విద్యార్థి సంఘాలకు అప్పగించాలి, ఎస్సీ, ఎస్టీ ,బిసి సమస్య లంటే ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం కురిసినట్లు గా ఉందని , 98 శాతం అత్యాచారాలు ఎస్సీ ,ఎస్టీ ,బీసీల పైన జరుగుతుంటే ఈ ప్రభుత్వం  పెడచెవిన పెట్టి కాలం గడుపుతుందన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ ఏర్పాటు చేసి మహిళలకు సపరేట్గా జీవో తెచ్చి  రక్షణ కల్పించాలని కొరారు. అలాగే మహిళ రెసిడెన్షియల్ స్కూలు, కాలేజీలు, మహిళా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కొరారు. భాదిత గిరిజన మహిళ కోటేశ్వరీ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని , లేని యెడల పెద్ద ఎత్తున రాస్తా రోకోలు
చేస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వనగంటి వెంకటేష్ యాదవ్ ,జై భీమ్ జిల్లా అధ్యక్షుడు బండారి సాయి ,సంతోష్ నాయక్ ,కందుల భాస్కర్ , కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts