కోదాడ లో ఏం ఎల్ సి ఎన్నికల నేపధ్యంలో భాగంగా తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కోదాడ ఎంఎస్ కాలేజ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. ఐకాస అంటే జాయింట్ యాక్షన్ కమిటి అని అందరిని కలుపుకొని పోయే విధంగా ఉండాలని, అలాంటిది నల్గొండ,ఖమ్మం,వరంగల్ లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్ పోటీ చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు , టీచర్స్ , విద్యార్థుల గురించి ఏ ఒక్క రోజు కూడా చట్ట సభల్లో మాట్లాడని పల్లా రాజేశ్వరెడ్డి పోటీ చేయడం దండగ అని ఎద్దేవా చేశారు. మూడు జిల్లాలలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే చట్ట సబల్లో మాట్లాడ గలిగే ఏకైక గొంతుకనైత అని, 40 సంవత్సరాల ఉద్యమ కారుకుడిగా తనను గుర్తించి గెలిపించాలని పట్టభద్రులను అభ్యర్దించారు.