YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గంగానదిలో ఘోర ప్రమాదం - 100మందికి పైగా గల్లంతు

గంగానదిలో ఘోర ప్రమాదం - 100మందికి పైగా గల్లంతు

దేశంలోని గంగానదిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బీహార్ లో జరిగిన పడవ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. ఇవాళ ఉదయం భగల్ పూర్ జిల్లాలోని గంగానదిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 100మందికి పైగా  రైతులు కూలీలతో వెళ్తున్న పడవ గంగానదిలో మునిగిపోయింది. నౌ గచ్చియా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సామర్థ్యానికి మించి పడవలో కూలీలనురైతులను ఎక్కించడమే కాకుండా సైకిళ్లుబైక్ లతో నదిని దాటే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 10మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 15 మంది దాకా ఈత కొడుతూ ఒడ్డుకు చేరారు. గల్లంతైన వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. బాధిత కుటుంబాల సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Related Posts