YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ హయంలో ఒక్క ఇల్లు కట్టలేదు

జగన్ హయంలో ఒక్క ఇల్లు కట్టలేదు

పోలవరం విషయం లో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు వివాదం సృష్టిస్తున్నారు.  చంద్రబాబు ఎవరినైనా మేనేజ్ చేయగలరు.  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో డబ్బులు ఇచ్చిన రైతులను

మళ్ళీ రికార్డుల్లో నమోదు చేసి డబ్బులు కాజేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  ఆరోపించారు. కలెక్టర్ భాస్కర్ 48 వేల కోట్లు పెంచేశారు. ఇప్పుడు మళ్ళీ అదే అధికారిని

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నియమించుకుంది.  విజయవాడ లో 10 కోట్లు తో గత ప్రభుత్వం గెస్ట్ హౌస్ కట్టింది. ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుంది.  జగన్ ను ప్రశ్నిస్తున్నాను.  పోలవరం

అవినీతి పై జగన్ ఎందుకు మాట్లాడటం లేదని. పోలవరం ప్రాజెక్టు కు కేంద్రం పూర్తి స్థాయిలో నిదులు ఇస్తుంది. పోలవరం ప్రాజెక్టు కట్టితీరుతాం. టిడ్కో గృహాలు 60 వేలు మాత్రం

పూర్తయ్యాయని అయన అన్నారు.
జగన్ వచ్చిన తర్వాత ఒక్క ఇళ్ళు కట్టలేదు.  జగన్ 30 లక్షలు పట్టాలు ఇస్తానంటున్నాడు. ఇళ్ళు పట్టాల్లో అవినీతి.  మునిగిపోయే భూములు ఇళ్ళు స్థలాలు గా పంపిణీ చేస్తారా అని

అన్నారు.
రాజమండ్రి  ఆవ భూములు కొనుగోలు లో 150 కోట్లు అవినీతి జరిగింది.  టీటీడీ బడ్జెట్ ఏడాదికి 1200 కోట్లు.  హిందుత్వం కోసం  500 కోట్లు ఖర్చు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. జగన్

ప్రజలు డబ్బులు తో చర్చిలు నిర్మిస్తున్నారు.  జగన్ ప్రతీ జిల్లా లో 15 కోట్లు తో చర్చిలు నిర్మిస్తున్నారు.  తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఎవరు. మంత్రులు నోరు మెదపడం లేదు.  పిఠాపురం

లో పనికిరాని భూములు కలెక్టర్ కొనుగోలు చేస్తున్నారు.  తూర్పుగోదావరి జిల్లాలో అవినీతి డబ్బులు ఎక్కడకి వెళుతున్నాయి. పోలవరం, టీటీడీ, ఇళ్ళు, ఇళ్ళు స్థలాలు అవినీతి జరిగింది.  

మోదీ ని చంద్రబాబు తిట్టవచ్చు. నేను చంద్రబాబు ని తిట్టకూడదా . ఏపీ లో నిజమైన ప్రతిపక్షం బీజేపీ అని అయన అన్నారు.

 

Related Posts