YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల ఓటర్ జాబితా నమోదునునెల రోజులు పెంచాలి

పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల ఓటర్ జాబితా నమోదునునెల రోజులు పెంచాలి

పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల ఓటర్ జాబితా నమోదును - వర్షాలు,  వరదల మూలంగా సర్టిఫికెట్లు కోల్పోయినందున ఒక నెల రోజులు పొడిగించాలని ఈ రోజు జాతీయ బి.సి సంక్షేమ

సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య గారి నాయకత్వంలో ఎలక్షన్ కమిషన్ అధికారులను కలిసి చర్చలు జరిపారు. ఎలక్షన్ కమీషనర్ శశాంక్ గోయల్ అనారోగ్య కారణాలతో సెలవులో

ఉన్నందున డిప్యుటీ కమీషనర్ సత్యవతిని కలిసి చర్చలు జరిపారు. అలాగే కొంతమంది అభ్యర్థులు భోగస్ ఓటర్లను ఆన్ లైన్ ద్వారా నమోదు చేస్తున్నట్లు పిర్యాదులు వస్తున్నాయి. భోగస్

యూనివర్సిటీల ద్వారా భోగస్ డిగ్రీ సర్టిఫికెట్లు సృష్టించి ఆన్ లైన్ ద్వారా ఓటర్ లిస్టులో నమోదు చేస్తున్నట్లు పిర్యాదులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. వీటిపై సమగ్ర విచారణ

జరుపాలన్నారు.ఈ చర్చల్లో రాష్ట్ర అద్యక్షులు ఎర్ర సత్యనారాయణ, జాతీయ ఉపాద్యక్షులు గుజ్జ కృష్ణ, యువజన సంఘం అద్యక్షులు నీల వెంకటేష్, భుపేష్ సాగర్, వంశీ కృష్ణ, ఉదయ్  

తదితరులు పాల్గొన్నారు.

Related Posts