YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జమ్మూలో మరో ఎన్ కౌంటర్

జమ్మూలో మరో ఎన్ కౌంటర్

జమ్మూకశ్మీరులోని పుల్వామా జిల్లా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. పాంపొరిలోని లాల్ పొరా గ్రామంలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్ లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. లాల్ పొరా గ్రామంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో భద్రత బలగాలు మోహరించాయి. జమ్మూకశ్మీరు పోలీసులు కేంద్ర భద్రతా బలగాలతో కలిసి గురువారం రాత్రి గాలింపు చేపట్టారు. గాలిస్తున్న జవాన్లపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు గాయపడ్డారు.ఈ ఎన్‌కౌంటర్ లో గుర్తుతెలియని ఉగ్రవాది ఒకరు మరణించారని జమ్మూకశ్మీరు పోలీసులు చెప్పారు. ఉగ్రవాదుల కోసం శుక్రవారం కూడా గాలింపు కొనసాగుతుందని జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు. శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్ తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపుజమ్మూకశ్మీరు సరిహద్దుల్లోని మూడు సెక్టార్లలో పాక్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద పాక్ సైన్యం కాల్పులు జరిపింది.పూంచ్ జిల్లా షాహపూర్, కిర్నీ, కసబా సెక్టార్లలో పాక్ షెల్లింగులతో కాల్పులు జరిపింది. పాక్ కాల్పులను భారత సైనికులు తిప్పికొట్టారు. కథువా జిల్లా హీరానగర్ సెక్టారులోని సరిహద్దు అవుట్ పోస్టు, సరిహద్దు గ్రామాలను లక్ష్యంగా చేసుకొని అంతర్జాతీయ సరిహద్దు వద్ద గురువారం అర్దరాత్రి పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది.పాక్ కాల్పులను భారత సైనికులు సమర్ధంగా తిప్పికొట్టారు.

Related Posts