YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

క్షతగాత్రుడిని ఆదుకున్న మంత్రులు

క్షతగాత్రుడిని ఆదుకున్న మంత్రులు

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి దీనంగా పడి ఉన్న వ్యక్తిని రాష్ట్ర మహిళా మంత్రులు కాపాడి మాన వత్వం చాటుకున్నారు. రాజధాని అమరావతి ప్రాంతం దొండపాడుకు చెందిన

నరసింహారావు గురువారం కరకట్ట రోడ్డుపై వెళుతున్న సమయం లో ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరసింహారావుకు తీవ్ర గాయాలయ్యా యి. అదే సమయంలో అటుగా వెళ్తున్న

హోంమంత్రి సుచరిత కరకట్టపై గాయాలతో పడిఉన్న నరసింహారావు ను చూశారు.వెంటనే వాహనాన్ని ఆపి తనతో పాటు ఉన్న రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితతో

కలిసి నరసింహారావును తమ కాన్వాయ్లో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నరసింహారావు పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తక్షణ సహాయం

అందించి తన ప్రాణాలను కాపాడినందుకు మంత్రులు సుచరిత, తానేటి వనితకు నరసింహారావు కృతజ్ఞతలు తెలిపాడు.

Related Posts